Jogulamba Gadwal Protest: పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనకు దిగారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కేంద్రం ఆదేశాలతో రేషన్ దుకాణాల్లో ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త సాఫ్ట్వేర్ ఈ-పాస్ పరికరాలు మొరాయించటంతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది.
మిడ్జిల్ మండలం వస్పుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇరుకు గదులు, సౌకర్యాల లేమితో విద్యార్థులు ఏటా తీవ్ర ఇబందులు పడుతున్నారు. పాఠశాల పీఎంశ్రీకి ఎంపిక కావటంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అనుకుంటే అదీ జరగలేదు.
కారిడార్ పొడవునా సాలీడు గూళ్లను తలపించేలా గోడలకు వేలాడుతున్న విద్యుత్తు తీగలు.. చేతికి అందేంత ఎత్తులో వైర్లు తేలిన ఫ్యూజులు, జంక్షన్ బాక్సులు, ఏమాత్రం రక్షణ లేకుండా బిగించిన స్టార్టర్లు..
పిల్లలూ.. ఈ ఆటలూ ఆడొచ్చు: కొన్ని క్రీడలకు ప్రత్యేకత ఉంది. ఈ వేసవి సెలవుల్లో వాటి గురించి తెలుసుకోవడమే కాక, ఆడే ప్రయత్నం కూడా చేయొచ్చు. బేస్బాల్: యూఎస్, జపాన్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్ తదితర దేశాల్లో ఈ ఆటకు 50 కోట్ల మందికి పైగా అభిమానులున్నారు.
సర్కారు బడుల్లో చదువుకుని అత్యున్నత స్థానాలు అందుకున్నవారు ఎందరో ఉన్నారు. అత్యంత ప్రభావశీలురుగా గుర్తింపు పొందిన ఎక్కువమంది ప్రభుత్వ స్కూళ్లో తమ భవితకు పునాది పడిందని చెబుతుంటారు..
తుఫ్రాన్పేటలో మే 30న లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. హత్యగా నిర్ధారించి నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లోని సరూర్నగర్ దోబీఘాట్కు చెందిన మారోజు రమేశ్(33) ఆటో డ్రైవర్.
బియ్యం పంపిణీకి వినియోగించే ఈ పాస్ యంత్రాల ఉన్నతీకరణ, మూడు మాసాల బియ్యం ఒకే సారి పంపిణీ, మారిన సాఫ్ట్వేర్ తదితరాలు వెరసి లబ్ధిదారులకు శాపంగా మారాయి.
ప్రభుత్వం గోశాలల ఏర్పాటు ద్వారా గోవుల సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అన్ని జిల్లాల పరిధిలో దేవాదాయ, ఇతర సాగుకు ఆమోదయోగ్యం కాని ప్రభుత్వ భూములను గుర్తించాలని సూచించింది.
వర్షాలు పడినా... జూరాలలో నిండుగా నీరున్నా.. సరఫరాలో లోపాలతో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పడంలేదు. మంగళవారం జూరాల గ్రిడ్ వద్ద ట్యాంకుల శుభ్రతకు నీటిని పూర్తిగా నిలిపివేయడంతో ఆ కష్టాలు రెట్టింపయ్యాయి.
జిల్లా కేంద్రంలో చరిత్ర కలిగిన కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఏటా వర్షాకాలంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో మొత్తం 27 తరగతి గదులకు గాను 19 గదులు పూర్తిగా శిథిలమయ్యాయి.
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసం పథకంలో లబ్ధిదారుల లెక్క తేల్చేందుకు మరికొన్నాళ్లు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానించారు.
జిల్లాలో యాసంగి వరి ధాన్యం సేకరణలో సింగిల్విండోలు అగ్రస్థానంలో నిలిచాయి. సేకరించిన మొత్తంలో 50 శాతం మేరకు విండోలే సేకరించడం విశేషమని చెప్పవచ్చు. దీని బట్టి ఈ సారి విండోలు కమీషన్ రూపంలో మంచి ఆదాయాన్ని సంపాదించారని చెప్పవచ్చు.
అడిగేవారు లేరని ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జా చేసేందుకు కొంతమంది అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రభుత్వ భూమి అంటే మరీ అలుసుగా తీసుకుంటున్నారు. మండల కేంద్రమైన గోపాల్పేట పెద్దవాగులో ఈరకమైన తతంగమే జరుగుతోంది.
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన డీఎస్ఆర్ యాప్ నిర్వహణకు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ససేమిరా అంటున్నారు. ఈ యాప్తో తమ వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వానాకాలం పంటల సాగుకు రైతన్నలు సమాయత్తం అవుతున్నారు. ఈ ఏడాది ముందస్తు వానలు కురుస్తుండటంతో ఇదివరకే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు, ఎరువుల సేకరణలో పడ్డారు.
‘నాణ్యమై న విత్తనం.. రైతన్నకు నేస్తం’లో భాగంగా మంగళవారం మరికల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైౖతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న భరోసా పథకం కింద నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని 1,860 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు చేశారు.
జిల్లాలో ఉన్న అనాథ, బడి బయటి బాలలను గుర్తించడానికి ప్రతీ గ్రామంలో ఆశ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, అంగన్ వాడీ టీచర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గం గ్వార్ సూచించారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) అండర్-19 ఉమ్మడి జిల్లా వన్డే క్రికెట్లో మహబూబ్నగర్ జట్టు నాగర్కర్నూల్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు సీఎం నియోజకవర్గమైన కొడంగల్లో ఎంత పరిహారం ఇస్తారో అదే రకమైన పరిహారం మన రైతులకు అందిస్తానని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర, మద్దూర్ మునిసిపాలిటీలతోపాటు మహబూబ్నగర్ నగరపాలక సంస్థలో వార్డుల విభజన ముసాయిదా మంగళవారం విడుదల కావాల్సి ఉండగా, బుధవారానికి వాయిదా పడింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని చాటి చెప్తోంది అనన్యశ్రీ. మక్తల్కు చెందిన ఆమె, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తొలిసారి అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి నాణ్యమైన వడ్లు సేకరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్.చౌహాన్ తెలిపారు.